25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

మణిపూర్ ఘటన.. నిందితుడి ఇంటికి నిప్పు

స్వతంత్ర వెబ్ డెస్క్: రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుతుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపలులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు హురైన్ ఇంటికి నిప్పు పెట్టారు.

మహిళల్ని ఊరేగించిన అమానవీయ ఘటన మ‌ణిపూర్‌లోని కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన జ‌రిగింది. అయితే బుధ‌వారం ఆ వీడియో మ‌రోసారి వైర‌ల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితుల‌కు మ‌ర‌ణ‌దండ‌న ఉంటుంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు రిజిస్ట‌ర్ చేశారు. కిడ్నాప్‌, గ్యాంగ్‌రేప్‌, మ‌ర్డ‌ర్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32) అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Latest Articles

మేడిగడ్డపై తుది నివేదిక రెడీ

మేడిగడ్డపై తుది నివేదిక వచ్చేసింది. నిపుణుల కమిటీ తమ నివేదికను NDSA ఛైర్మన్‌కు అందించింది. కేంద్ర జలశక్తి ఆమోదం తర్వాత సంబంధిత రిపోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్