మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి జేసీబీలతో ప్రహరీగోడను కూల్చివేశారు. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు అంటూ మల్లారెడ్డికి చెందిన, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు.