స్వతంత్ర వెబ్ డెస్క్: బీహార్ లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులు పడడంతో ఒక్క మంగళవారం రోజే 32 మంది మృత్యువాత పడ్డారు. 14 జిల్లాల పరిధిలో పిడుగుపాటు మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బీహార్ లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇవాళ ఈశాన్య, నైరుతి బీహార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పిడుగుల బీభత్సం.. ఒక్కరోజులో 32మంది మృతి
0
297
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


