వయనాడ్ ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విషాదకర ఘటనతో వందల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.