కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అని అన్నారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దు కుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి కన్ను కుట్టించిన తమ వరప్రదాయిని కాళేశ్వరం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని పేర్కొన్నారు. దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమా ధానం కాళేశ్వరం అని తెలిపారు. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీ వమి చ్చిన పుణ్య వరం కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాంసాగర్ కు నిండు కుండలా మార్చే అండ దండ కాళేశ్వరం అని చెప్పారు. మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించి న మహత్యం కాళేశ్వరం..తమ తపన, ఆలోచన, అన్వేషణ అని అన్నారు. రాజకీయ కుళ్లు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలమని, మీ ఏడుపే మా ఎదుగుదల అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.