32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

కడియం కుమార్తె పార్లమెంట్ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం

       వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిం చారు. ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, కడియం కావ్య తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్న అరూరి రమేష్ బీజేపీలో చేరికకు సిద్ధమవడం, అధి నేత బుజ్జగించినా ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పార్టీ అధీష్ఠానం కడియం కావ్య వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇక సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

      బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి, వినయరాణి దంపతుల కుమార్తె అయిన కడియం కావ్య 1983 ఏప్రిల్ 10న జన్మించారు. ఎంబీబీఎస్ చదివిన ఆమె ఎండి.నజీరుల్లా షేక్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా.. కావ్య ఫాతిమా రిలీఫ్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేం దుకు ఆమె ఈ పార్లమెంట్ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్