కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లాకు వచ్చారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య. నేరుగా హన్మకొండలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈనేపథ్యంలోనే వారికి వర్థపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగ రాజును కలిసిన కడియం శ్రీహరి, కావ్య.. తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డు కోవాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం అని ఈ సందర్భంగా కడియం శ్రీహరి అన్నారు.