స్వతంత్ర వెబ్ డెస్క్: భాగ్యనగరంలో మొసలి పిల్ల కలకలం రేపింది. నగరంలోని చింతల్బస్తీ నూతన కొత్త వంతెన నిర్మాణం చేపట్టినచోట నాలాలో ఓ మొసలి పిల్లను స్థానికులు గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో ఇది కొట్టుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బల్కాపూర్ నాలా ఉద్ధృతికి ఇది కొట్టుకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
మొసలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. మొసలిని బంధించేందుకు రంగంలోకి దిగిన నాలుగు టీమ్లు ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించారు. జూ అధికారులకు ఆ మొసలి పిల్లను అప్పగించారు.