స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు. ఈసారి రూ.27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ధరను ఈసారి వేలం దాటేసింది.
ఈ లడ్డూని దక్కించుకున్న వారు.. బాలాపూర్ లోని వ్యవసాయ పొలాల్లో దాన్ని చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చే డబ్బును బాలాపూర్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్లే ఒకప్పుడు సాధారణ పల్లెటూరిలా ఉండే బాలాపూర్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ అభివృద్ధికి తగ్గట్టే… వేలంలో లడ్డూ ధర కూడా ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. ఇలా ప్రతీ సంవత్సరం లడ్డూ వేలం వేస్తున్నారు. హైదరాబాద్లో ఈ లడ్డూ వేలం తర్వాతే శోభాయాత్ర జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఐతే… ఈ సంవత్సరం లడ్డూ వేలం పాటకి కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ వేలంపాటను విజయవంతంగా ముగించి.. ఇక శోభాయాత్ర ప్రారంభించారు.