Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మహిళా క్రికెట్ జట్టుకు రూ. 5 కోట్ల నజరానా ‘ ఘన సన్మానం

పురుషాధిక్య ప్రపంచం, ఆధిపత్య ధోరణి లేదంటారు గానీ, ఇప్పటికి అది స్పష్టంగానే కనిపిస్తుంటుంది. ఉదాహరణకి క్రికెట్ నే తీసుకుంటే పురుషుల క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మహిళా క్రికెట్ కి ఉండదు. కానీ ఇప్పుడు భారతదేశమంతా ఒక్క క్షణం ఆగి మహిళా క్రికెట్ వైపు చూస్తోంది. కారణం ఏమిటంటే మహిళల అండర్ -19 వరల్డ్ కప్ వారు సాధించడమే అందుకు కారణం…మరి ఆ సంగతులేమిటో చూసేద్దామా…

2022లో అండర్ 19 కుర్రాళ్లు వరల్డ్ కప్ తీసుకువచ్చారు. మళ్లీ 2023లో అదే అండర్ 19 గ్రూప్ లో మహిళలు విజయం సాధించారు. ఇక్కడ యాధృచ్చికంగా అటూ, ఇటు కూడా ఇంగ్లాండ్ ప్రత్యర్థి కావడం చెప్పుకోతగిన అంశం. మొత్తానికి అబ్బాయిలు-అమ్మాయిలు కూడా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్రపంచ కప్పు తీసుకువచ్చారనేది నిజం.

మహిళా క్రికెట్లో ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో యువ మహిళా రత్నాలు అద్భుత ప్రతిభను చూపించారు. ప్రతి మ్యాచ్ ని మహిళా క్రికెటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడి రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ షెఫాలీ వర్మ ప్లానింగ్ వల్లనే కప్ వచ్చిందని అంటున్నారు. ఇక బ్యాటింగులో శ్వేత, షెఫాలి, త్రిష సృష్టించిన పరుగుల వరదతో ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయారు. బౌలింగులో రెచ్చిపోయిన పార్శవి చోప్రా, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి తదితరులు సమయానుకూలంగా తీసిన వికెట్లు, ఇలా అంతా కలిసికట్టుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

సెమీఫైనల్స్ వరకు వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలున్నా, ఎక్కడో ఆశలు కూడా చిగురించాయి. అనూహ్యంగా న్యూజిలాండ్ ను మట్టికరిపించి, ఫైనల్ కి మన మహిళామణులు చేరుకున్నారు. అదే ఊపుతో ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించారు. కేవలం 68 పరుగులకే వారిని కట్టడిచేశారు. అనంతరం మనవాళ్లు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, సగర్వంగా ప్రపంచ కప్ ని ఇండియాకి తీసుకువచ్చారు.

మహిళా క్రికెట్ ని ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ శాసిస్తున్నాయి. మన ఇండియా వరకు వస్తే మాత్రం ఎన్నో సంవత్సరాలు పురుషాధిక్య ప్రపంచం తాకిడికి వారు వెనక్కి వెనక్కి వెళ్లిపోయారు. ప్రతిచోటా మీరెక్కడ ఆడగలరు? మీరెక్కడ చేయగలరు? ఇక్కడికి మీరెందుకు? ఇవే ప్రశ్నలు…అలాంటి బలమైన వ్యవస్థను ఎదుర్కొని రాటు దేలినవారిలో మిథాలీరాజ్, ఝలన్ గోస్వామి లాంటివారున్నారు.

అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల సహకారంతో కొందరు మహిళామణులు ముందుకు రావడం వల్లే, వారు వేసిన పునాదులపైనే నేడు పురుషులకు దీటుగా మహిళా క్రికెట్ కూడా ఎదుగుతోంది. ఆ క్రమంలో ఛాంపియన్ ట్రోఫీ తీసుకు వచ్చింది. దురదృష్టం ఏమిటంటే క్రికెట్ బోర్డు కూడా ఏనాడు వారిని పట్టించుకోలేదు. సరిగ్గా ఫండ్స్ ఇవ్వలేదు. సౌకర్యాలు కల్పించలేదు. ఇక తప్పదు రా బాబూ, అన్నట్టు ఇతర దేశాలకు పంపించేవారు.

ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ రావడంతో బీసీసీఐ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఎన్నడూ లేనంతగా జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో టీమ్ సభ్యుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. భారత్-న్యూజిలాండ్ టీ-20 మూడో మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. మ్యాచ్ అనంతరం భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సచిన్, ఆఫీసు బేరర్ల చేతుల మీదుగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.

దక్షిణాఫ్రికా నుంచి మహిళా జట్టు ముంబయికి చేరుకుంటుంది. అక్కడ నుంచి నేరుగా వారు అహ్మదాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మహిళా క్రీడాకారిణులను ఘనంగా సత్కరించి అభినందించనున్నారు. ఇలా చేయడంతో మహిళాక్రికెట్ కి కూడా మంచి రోజులు వచ్చాయని పలువురు వ్యాక్యానిస్తున్నారు.

అంతేకాదు ఐపీఎల్ క్రికెట్ లీగ్ తరహాలోనే వనితల క్రికెట్ లీగ్ పట్టాలెక్కనుంది. గుజరాత్ జెయింట్స్ కు మిథాలీరాజ్ మార్గనిర్దేశకురాలిగా ఎంపికైంది. ఇక నుంచి క్రికెట్ ని కూడా వృత్తిగా ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. వేలం పాటలో కూడా మహిళా క్రీడాకారిణులకు ఎక్కువ ధరలు పలకడంతో బీసీసీఐ కూడా ఊపిరి పీల్చుకుంది. రాబోవు రోజుల్లో మహిళా క్రికెట్ కు మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటి నుంచి క్రికెట్ ను ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్