ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ పిలుపు నిచ్చింది. మొన్న సిసోడియా, నిన్న కేజ్రీవాల్ నేడు బిభవ్ కుమార్.. ఇలా వరుసగా అరెస్ట్ లు చేయడం పట్ల నిరసన తెలపాలని ఆమ్ ఆద్మీపార్టీ నిర్ణయించింది. దీంతో ఢిల్లీ బీజేపీ కార్యాయం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆందోళనలో డిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొంటారని తెలియడంతో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.