21.7 C
Hyderabad
Wednesday, January 28, 2026
spot_img

సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబాకు మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. మౌలాలిలోని ఆయన నివాసానికి చేరుకున్న హరీశ్‌రావు.. సాయిబాబా పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. హరీశ్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తుల ఉమ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. సాయిబాబా భౌతిక కాయానికి నివాళులర్పించారు.

సాయిబాబా మృతి బాధాకరమని చెప్పారు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి నిర్ధోషిగా బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలా జరగడం శోచనీయమని హరీశ్ రావు అన్నారు. దశాబ్ద కాలంపాటు ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అని తెలిపారు. ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరమన్నారు. సాయిబాబా మృతికి కేంద్రం బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్