అమెరికాలో కాల్పుల బీభత్సం… ఐదుగురు మృతి

US Gunfire |అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. ఈస్ట్ మెయిన్ స్ట్రీట్​లోని లూయివిల్​లోని ఓ బ్యాంకు భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృత్యుఒడికి చేరారు. అయితే ఈ కాల్పుల్లో నిందితుడు సైతం మరణించినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

US Gunfire |పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈస్ట్ మెయిన్ స్ట్రీట్​లోని లూయివిల్​లోని ఓ భవనంలో గల ఓల్డ్ నేషనల్ బ్యాంక్ లో దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే కాల్పులు జరపడానికి ముందే లూయివిల్ మెట్రో పోలీస్ శాఖ వెంటనే ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఈ దుర్ఘటనలో పలువురుమృతి చెందారని పేర్కొన్నారు. అయితే అక్కడున్నవారు మాత్రం తుపాకీ శబ్దాలు వినిపించగానే భవనం నుంచి బయటకు పరుగులు తీశారని… దీనిని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీస్ శాఖ వెంటనే చేరుకొని.. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రులకు తరలించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also: సీపీఐకి జాతీయ హోదా రద్దు చేయడం విచారకరం: సీపీఐ నారాయణ

Follow us on:  Youtube Instagram Google News

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్