స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 3 గంటల కరెంటే దిక్కు అన్నారు. తెలంగాణలో 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. 3 గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా? రైతులు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ని గెలిపించి తప్పు చేశామని కర్నాటక ప్రజలు అనుకుంటున్నారన్నారు. దేశంలో ఏ ఒక్కరినీ కాంగ్రెస్ ఓన్ చేసుకోలేకపోయిందన్నారు. ప్రతీ నాయకుడిని, ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుందన్నారు. నీళ్లు, కరెంట్, ఎరువులు ఇవ్వనోళ్లని మళ్లీ గెలిపించాలా అని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇచ్చినా మళ్లీ అవకాశం కావాలంటున్నారని మండిపడ్డారు.
అక్కడ రైతులు లెంపలేసుకుంటున్నారు.. కాంగ్రెస్పై KTR కీలక వ్యాఖ్యలు
0
239
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


