రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ

RRR చిత్రంలో గ్లోబెల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాంచరణ్(Ram Charan).. మరో ఘనత సాధించారు. ఇప్పటికే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు మూవీ యూనిట్ కు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్.. ప్రధాని మోదీతో స్టేజ్ షేర్ చేసుకోనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్(India Today Conclave) లో చరణ్ పాల్గొనబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు మోదీ(Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin) కూడా ఈ షోలో పాల్గొనున్నారు. ఈ షోలో చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. RRR సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం వంటి అనేక విషయాల గురించి చరణ్(Ram Charan) ఈ వేదికపై మాట్లాడనున్నారు. ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం తెలుగు ప్రజలందరుకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Read Also: ఆ నెలలోనే విశాఖ నుంచి పరిపాలన: జగన్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్