సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్(CEC)కి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని తేల్చి చెప్పింది. బిహార్లో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ జాబితా విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు ఇచ్చింది. సర్లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం కోల్పోరని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఓటర్ల వివరాలు తెలుసుకోవడం హక్కుల ఉల్లంఘన కాదని చెప్పింది. సర్ ప్రక్రియకు తగిన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని పేర్కొంది. ఓటర్ల జాబితాలో చేరికలు- తొలగింపులు చేసే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
SIR నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది- సుప్రీంకోర్టు
0
6
Previous article
Latest Articles
ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతాం- మంత్రి పొన్నం
ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కూకట్పల్లిలో 60 ఈవీ బస్సులను పొన్నం ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు.. రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి అన్నారు....
- Advertisement -
- Advertisement -


