బెంగళూరులో ఎబోలా కలవరం… ఉగాండా మహిళ ఐసోలేట్

బెంగళూరు .. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు రోజుల క్రితం వచ్చిన 28 ఏళ్ల ఉగాండా మహిళను ముందుజాగ్రత్త చర్యగా ఇందిరా నగర్ అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ఎబోలా పరీక్ష కోసం ఆమె నమూనాలను సేకరించారు. ఆ మహిళలో జ్వరం వంటి స్పష్టమైన లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే తెలిపారు. . ఆమె లక్షణాల గురించి తమకు ఇంకా స్పష్టత లేదని… విమానాశ్రయ ఆరోగ్య సంస్థ అలసట వంటి కొన్ని లక్షణాలను గమనించి, నమూనా తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. పరీక్షల కోసం నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఉగాండా నుంచి వచ్చిన ఆ మహిళ మొదట ఒక హోటల్‌లో బస చేశారు. అయితే ఒళ్లు నొప్పుల వంటి తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఆఫ్రికన్ దేశాలనుంచే వచ్చే ప్రయాణీకులపై ఓ కన్ను వేసి వుంచాలని ఆరోగ్య శాఖ అధికారులు అన్ని విమానాశ్రయ సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలు అంతగా భయపడాల్సిన పని లేదని , దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను నమ్మవద్దని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.

Latest Articles

సెంట్రల్ రైల్వే స్టేషన్లలో వడా పావ్‌, సమోసా, దోస, ఇడ్లీ ధరలు పెరిగాయ్‌

సెంట్రల్ రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ స్టాళ్లలో అమ్మే ఆహార పదార్థాల ధరను సవరించింది. జూన్‌ 1 నుంచి అన్ని స్టేషన్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా సవరణ ప్రకారం 50 గ్రాముల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్