కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం గన్నవరం. విజయవాడ మహానగరానికి అతి చేరువలోనే ఉన్న ఈ నియోజకవర్గం నుంచి హేమాహేమీల్లాంటి నేతలు పోటీ చేశారు. చట్ట సభలకు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వల్లభనేని వంశీ. మరి.. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది ?ఆ వివరాల్లోకి వెళదాం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గన్నవరం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ మోహన్. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే.. ఆ తర్వాతి కాలంలో జగన్ పరిపాలనా విధానాలు నచ్చి వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచే నియోజకవర్గంలో అసలు ఆట మొదలైంది. చివరకు వైసీపీ కేండిడేట్గా 2019లో బరిలో దిగిన యార్లగడ్డ వెంక ట్రావు.. వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
రాజకీయాల సంగతి కాస్త పక్కన పెట్టి.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే… గన్నవరం మండలం దావాజిగుడెం గ్రామంలో విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పక్కా ఇళ్లు నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఎమ్మెల్యే వంశీ. నియోజకవర్గంలో అవసరమైన చోటల్లా సిమెంట్ రోడ్లు వేయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చేలా చూడడంతోపాటు తన సొంత నిధులతో పేదల ఆరోగ్యం కోసం హాస్పి టల్లో ఉండే వివిధ రకాల ఖర్చులు భరించారు వంశీ. గన్నవరం విమానాశ్రయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం, చిన్న అవుటుపల్లి నుంచి గొల్లపూడి హైవే … విద్యార్థులకు బస్పాస్ల కోసం సాయం అందించడం … వీకేఆర్ కాలేజీ కోసం సొంత బస్సులు అందుబాటులోకి తేవడం లాంటివి పలు కార్యక్రమాలు చేపట్టారు వల్లభనేని వంశీ మోహన్. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు సొంతంగా వల్లభనేని వంశీ చేపట్టిన కార్యక్రమాలు నియోజకవర్గంలోని ప్రజలకు ఆయన్ను మరింత చేరువ చేశాయి.
ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన హామీలు.. అమలు చేసిన కార్యక్రమాల విషయంలో ఏ మేరకు తేడా ఉంది ? నియోజక వర్గంలో డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడం, డంప్ యార్డ్ లేకపోవడం ఏ మేరకు ప్రభావం చూపెట్టాయి ? ఇక, టీడీపీ నుంచి బయటకు వెళ్లి వైసీపీకి దగ్గరైన వంశీ మోహన్పై స్థానికంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ?టీడీపీకార్యకర్తలు, నేతల మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప.. ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే వంశీ.. చేపట్టలేదని పెదవి విరుస్తున్నారు గన్నవరం నియోజకవర్గ ప్రజలు. ఎక్కడిదాకో ఎందుకు నియోజకవర్గం పరిధిలోని మండలాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చెబుతున్నారు. ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్లే రోడ్డుపై చెత్త వేయడం వల్ల.. రోడ్డుపై ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగుతు న్నాయని అంటున్నారు.
డంపింగ్ యార్డ్ లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు స్థానికులు. దీని వల్ల చెత్తను ఎక్కడి కక్కడ తగుల బెట్టడం వల్ల రహదారులపై వెళ్లే వాళ్లకు సమస్యగా మారడంతోపాటు కొన్నిసార్లు దారి కన్పించక ప్రమా దాలు అవుతున్నాయని చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏటా వందలాదిగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. దీంతో.. వాళ్లకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవ డంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. విజయవాడకు పక్కనే ఉన్నా ఇలా జరగడం నిరుద్యోగుల్లో అసంతృప్తి నింపుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తంగా నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్లుగానే ఎమ్మెల్యే పని తీరు ఉందన్న వాదన విన్పిస్తోంది. దీంతో.. వంశీకి వందకు యాభై మార్కులు ఇస్తున్నారు ఇక్కడి ప్రజలు. అంగ, అర్థ బలం పుష్కలంగా ఉండడం, ప్రజలకు చేరువైన నాయ కుడు కావడంతో రానున్న ఎన్నికల కోసం వైసీపీ తమ అభ్యర్థిగా వంశీని గన్నవరం బరిలో దింపింది. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరి.. వీరిలో గెలుపు ఎవరిది అన్నది త్వరలోనే తేలనుంది.