Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ డైలాగ్ వార్

   పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఎపిసోడ్‌ కాక రేపితే… తాజాగా హస్తం వర్సెస్‌ కమలం పాలిటిక్స్‌ మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. రేవంత్ సర్కార్ కూలుతుందంటూ కమలనాథులు చేసిన మాటలు సంచలనంగా మారాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ తో రాజకీయాలు హాట్ గా మారాయి.

     తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు షిండే చుట్టూ తిరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నా మేము సిద్ధంగా లేమంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్టేట్‌ పాలిటిక్స్‌లో దుమారం రేపుతున్నాయి. వెంకట్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని.. మేం గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలడం ఖాయమంటూ ఆయన చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీల వద్దకు మంత్రి వెంకట్‌రెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారని..కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి. బీజేపీ హైకమాండ్‌ తో ఆయన టచ్‌లో ఉంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనడం ఏంటని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వెంకట్‌రెడ్డితో ఆయన సోదరుడే టచ్‌లో లే రు.. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లోకి వస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదని.. తమ పార్టీ వారిని ముట్టుకునే సాహసం చేయొద్దని.. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపో తుందని హెచ్చరించారు మహేశ్వర్‌రెడ్డి.

ఇక పనిలో పనిగా రేవంత్‌ను కూడా వదలలేదు మహేశ్వర్‌రెడ్డి. ఎప్పుడు సీఎం కుర్చీ పోతుందోనని నిద్రపట్టడం లేదని రేవంత్‌పై సెటారికల్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని…వాళ్ల మంత్రులే కూల్చుతారని జోష్యం చెప్పారు. ఇప్పటికే పది మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారని ఓటుకు కోట్లు కేసుతోనో, ఇంకో అంశంతోనో తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌కు నిద్రపట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్‌ ట్యాక్స్‌ పేరిట 3 వేల కోట్లు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లా డటం సరికాదని హితవు పలికారు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని.. వారి వైఫల్యాలను కప్పిపుచ్చు కొనేందుకు ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తు న్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి. గతంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనకు టికెట్‌ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తప్పుబట్టారు. తాను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాక.. తాను కాంగ్రెస్‌లో చేరుతానని… సాయం చేయమని మహేశ్వర్‌ రెడ్డి కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు. నితిన్ గడ్కరీకి, అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పానని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదు భగవంతునికి తెలుసన్న కోమటిరెడ్డి… ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్‌కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనర్ధన్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాల వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని…. కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు.

ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్‌ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఐదుగురు మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తాను కాలేజీలో ఏబీవీపై గెలిచిన వాడినని గుర్తు చేశారు. తనను టచ్‌ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని పొన్నం వార్నింగ్‌ ఇచ్చారు.మొత్తానికి మొన్నటి వరకూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌ కాస్తా.. ఇటు హస్తం, కమలం నేతల వైపు తిరిగింది. మరి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బాంబు పేల్చినట్టు కాంగ్రస్‌లో కుర్చీ కుట్ర జరుగుతోందా..? కోమటిరెడ్డి షిండే పాత్ర వహిస్తున్నారా..? వెంకట్‌రెడ్డి కాకుండా టచ్‌లో ఉన్న మరో ఐదుగురు మంత్రులెవరన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగు తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్