25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

ఏపీ శాసన మండలిలో గందరగోళం

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్‌ తెలిపారు. అయితే, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని.. అలా చేస్తే తప్పేం కాదన్నారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతి ఇవ్వాలని మండలి ఛైర్మన్‌ మోషేనురాజు కోరగా.. మంత్రి అనిత తీసుకెళ్లి ఇచ్చారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని.. పరిశ్రమలు వచ్చిన తర్వాత రెండు, మూడేళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేశ్‌ బదులిచ్చారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్