సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోద రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్లు ప్రారంభించారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో CETP ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ ప్లాంటుకు 104 కోట్లు కాగా PCB శాఖ ద్వారా 25 కోట్లు మంజూరు చేసిందన్నారు.ఇందిరాగాంధీ హయాంలో పాశమైలారంలో 1980లో పరిశ్రమలను స్థాపిం చారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు CETPని ప్రారంభించుకో వడం చాలా అనందంగా ఉందన్నారు. మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పేరుకుపోయిం దన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు.
పాశమైలారంలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభం
0
218
Previous article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


