ఆంధ్రప్రదేశ్ లో ఇకపై కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలసీ గతానికీ ఇప్పటికీ మార్పు కనబడాలని ఆయన అధికారు లకు స్పష్టమైన ఆదేశాల ను జారీ చేశారు. తక్షణమే ఇసుక అందుబాటులోకి రావాలని చంద్ర బాబు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ రంగంలో సంక్షోభం నెలకొందని, ఇసుక కొరత, ధరల భారంతో పనుల్లేక కార్మికుల విలవిలాడారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఏజెన్సీలు వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని, ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు.