బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్ర బాబు సామాజిక న్యాయం చేయలేదని మండిప డ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయపరం గా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.


