36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ ఝలక్..!-పాత కేసులపై సీబీఐ విచారణ ప్రారంభం

  • రైల్వే మంత్రిగా కేటాయింపులపై అవినీతి కేసులు
  • 2021లో ముగిసిన అవినీతి కేసులపై విచారణ

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ ఝలక్ ఇచ్చింది. యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రైల్వే మంత్రి హోదాలో ఆయన చేసిన కేటాయింపులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో ఆయనపై అవినీతి కేసులున్నాయి.ఈ కేసులకు సంబంధించి 2018లోనే సీబీఐ విచారణ ప్రారంభించింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన విచారణ 2021లో ముగిసింది. అయితే ఈ కేసులను తిరిగి తోడాలని సీబీఐ నిర్ణయించుకుంది. బీహార్ లో రాజకీయ పరమైన నిర్ణయాలు శరవేగంగా మారుతున్నాయి. కొన్ని నెలల కిందట భారతీయ జనతా పార్టీతో జేడీయూ తెగతెంపులు చేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ తో జేడీయూ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పాత కేసులను తిరిగి తోడాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది.

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్