అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. తుఫాన్ హెచ్చరికలు రావడంతో ప్రభుత్వ అధికారులు పాపికొండల విహార యాత్రకు బ్రేక్ ఇవ్వాలని కీలక నిర్ణ యం తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు. నాలుగు రోజుల పాటు పాపికొండల విహార యాత్రను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ తగ్గిన తర్వాత మళ్లీ విహారయాత్ర పునః ప్రారంభం అవుతుం దని తెలిపారు.తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.