స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ కు గిప్ట్ గా ఇస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని విమర్శించారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు.
కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఉహించలేదని, కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు అగమైపోయాయని చెప్పుకోచ్చారు. 2023 ఆగస్టు 23న సీఎం కేసీఆర్ మెదక్ టూర్ లో భాగంగా ఏర్పాట్లను మంత్రి దగ్గరుండి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పోలీస్ కార్యలయం, సమీకృత కలెక్టరేట్ కార్యలయాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.
ఇదే వేదికపై వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిదంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు వెల్లడించారు.