ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ స్పీడు పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.20కి బేగంపేట విమానాశ్రయం చేరుకుం టారు అమిత్ షా. 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్లో దిశానిర్దేశం చేస్తారు.3.15 నుంచి 4.25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులు ఆపై స్థాయి నేతల మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. 4.45 నుంచి 5.45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత, కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమ వుతారు అమిత్ షా
నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
0
369
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


