కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ తెల్ల వారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మచిలీ పట్నంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొనకళ్ల నారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, కొనకళ్లకు గుండెపోటు రావడం ఇది రెండోసారి. గతంలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు.