Khammam Accedent | కూలిపనులకు వెళ్తున్న 15 మంది మహిళలతో కూడిన ఆటోను అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూర్ అంబేద్కర్ నగర్కు చెందిన కొంతమంది మహిళా కూలీలు.. రోజు వారి పని రీత్యా మిరపకాయలు కోయడానికి ఆటోలో 15 మంది ఏన్కూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతివేగంతో వస్తున్న ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు కావడంతోవారిని ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు వరమ్మ (40), వెంకటమ్మ(45) గా పోలీసులు తెలిపారు.
మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
0
285
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


