Bopparaju Venkateswarlu |జీతాలు పెంచాలని డిమాండ్ చేసే స్థాయి నుంచి ఒకటో తేదీన జీతాలు పడితే స్థాయికి ఉద్యోగులు వచ్చారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఒకటో తేదిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమన్నారు. సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టలేక వడ్డీలు కట్టే దుస్థితి నెలకొందని వాపోయారు. కొంతమంది ఉద్యోగులు అయితే అవసరాలకు లోన్ యాప్ ల ద్వారా తీసుకున్న డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన నేతలు ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ లేఖను ఆయనకు అందజేశారు.
Read Also: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
Follow us on: Youtube, Instagram, Google News