25.1 C
Hyderabad
Wednesday, July 30, 2025
spot_img

హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Poster War |దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నేతలు పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణలో కూడా కొంతకాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్(Poster War) జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం విష‌యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు.

Read Also: అది నా బాధ్యత.. బంగ్లా ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్