అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందన్నారు. ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి… అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. అయితే.. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. అయితే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ డీల్ విషయాన్ని ధ్రువీకరించారు. డీల్పై శుక్రవారం నాడు సంతకాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
0
27
Latest Articles
కట్టేసి కొట్టి, మూత్రం తాగించి.. ఛత్తీస్గఢ్లో భార్యను టార్చర్ చేసిన భర్త
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన చేతులు, కాళ్లు కట్టేసి, తల గుండు చేసి, ముఖానికి బూడిద పూసి, దారుణంగా కొట్టడమే కాకుండా,...
- Advertisement -
- Advertisement -


