విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్ విజయవాడకు వెళ్లనున్నారు. డీజీపీ, విజయవాడ సీపీని ఆయన కలవనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు.
సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు సీఐ నాగరాజు పరారీలో ఉన్నాడు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజు సీఐగా విధులు నిర్వహించిన పోలీస్ స్టేషన్లోనే నిందితుడిగా మారాడు.


