పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడులకు భారతీయులు బలి కావాల్సి వచ్చింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది .దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. వారిలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ధ్రువీకరించారు. మృతులు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్గా గుర్తించారు. ఒమన్ తీరంలోనే జలవిహార్ అనే నౌకపై అమెరికా మరో దాడి చేసింది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి.
ఇరాన్, అమెరికా వార్లో ఇండియన్స్ బలి
0
17
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


