మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థలు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఎన్నిక ఏకగ్రీవమైందని ఈసీ ప్రకటించింది.
ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతంపై వివరణ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేల రాజ్యాంగ హక్కులను బీజేపీ హరిస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ ఆరోపించారు


