కేరళ కోజికోడ్లో షిగెల్లా వ్యాధితో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. షిగెల్లాని షిగెల్లోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది మొదట పేగులో ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన వారితో నేరుగా కాంటాక్ట్ అయినా ఇతరులకు వ్యాపిస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధి తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రం షిగెల్లా ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా ఐదేళ్ల చిన్నారులకు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఇది ప్రమాదకరం. వృద్ధులకు కూడా షిగెల్లా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
కేరళలో షిగెల్లా డేంజర్ బెల్
0
53
Next article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


