ఏలూరు జిల్లా పోతురెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంటి పెద్దలు పనుల్లో నిమగ్నమైనప్పుడు చిన్నారులు చెరువుల వద్దకు వెళుతున్నారని గ్రామస్తులు హెచ్చరించారు. గతంలోని ఘటనలను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చిన్నారుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు స్థానికులు.
ప్రమాదకరంగా చెరువుల వద్ద చిన్నారుల ఆటలు
0
7
Previous article
Next article
Latest Articles
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో హైడ్రామా చోటుచేసుకుంది. సెల్ టవర్ ఎక్కి ఓ రైతు హల్చల్ చేశారు. మట్టిమాఫియా అక్రమాలు ప్రశ్నించినందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బలవంత్ రెడ్డి టవరెక్కి హంగామా...
- Advertisement -
- Advertisement -


