కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. వన్ హాస్పిటల్లో పరామర్శకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో లిఫ్ట్ ఎక్కిన సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కిందకు పడిపోయింది. దీంతో మంత్రి సహా అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై ఆస్పత్రి సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు.
కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వన్ హాస్పిటల్కు పరామర్శ నిమిత్తం వెళ్లిన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మంత్రి లిఫ్ట్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కిందకు జారిపోయింది. ఈ ఘటనతో మంత్రి సహా వెంట ఉన్న అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన అనంతరం ఆస్పత్రి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా..? సాంకేతిక లోపమా..? అన్న కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు.


