రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి రూ.500 కోట్లు
పామాయిల్ సాగు ప్రోత్సాహకానికి రూ.179 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.96 కోట్లు
రూ.300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
మార్కెటింగ్ శాఖకు రూ.315 కోట్లు
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్
శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో జీడి మామిడి క్లస్టర్
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసమీ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్
ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పామాయిల్, కోకో క్లస్టర్
రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ.250 కోట్లు
కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.9400 కోట్లు
భూమిలేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20వేలు
వ్యవసాయ శాఖకు రూ.12.401 కోట్లు
పంటల బీమా పథకానికి రూ.1,028 కోట్లు
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139.65 కోట్లు
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రూ.61.78 కోట్లు
డ్రోన్ల రాయితీల కోసం రూ.80 కోట్లు
875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి సాగు ఖర్చులను తగ్గించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి తమ లక్ష్యమని అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలు ఉన్నాయని అన్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6300 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.


