ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చట్టం తని పని తాను చేసుకుంటూ వెళుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్పై తానేమీ మాట్లాడనని అన్నారు. ఏసీబీకు పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనని.. తీగ లాగితే డొంక కదులుదుందని అన్నారు. ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్కుమార్పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.
కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు – మంత్రి పొంగులేటి
0
182
Previous article
Next article
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


