2026 డిసెంబర్కల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. SLBC సొరంగంతో రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని చెప్పారు. దీనివల్ల ఏటా 200 కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కోసం 4వేల637 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలకు చాలా మేలు చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.


