బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి కేజ్రీవాల్ మాట్లాడారు. జూన్ 4వ తేదీన భారత కూటమి అధికారంలోకి వస్తోందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఈసారి బిజెపికి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.