కాకినాడ జిల్లా కొండెవరం గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. నిన్నటి నుంచి పడిగాపులు కాచినా … వైసీపీ నాయకులు తమకు డబ్బులు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. స్థానిక వైసీపీ నాయ కుడు కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి 100 కుటుంబాలకు పైన ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులు నొక్కేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


