రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి భరోసా కల్పించారు. ఏపీలో ఎక్కువగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు ఇంట్రస్ట్ కింద సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం జరిగేదన్నారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసేశారన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకుంటామని పురందేశ్వరి తెలిపారు.


