విజయవాడలో పోయిన వారం జగనన్న మీద దాడి జరిగిందని, రాయి విసిరిన పిల్లవాడి మీద హత్యాయత్నం కేసు పెట్టారని సునీత అన్నారు. కడపలో ఇంటించి ప్రచారం చేస్తున్న ఆమె దాడి చేసిన పిల్లవాడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో ఉంచారని ఆరోపించారు. పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై కొందరు దాడి చేశారని, ఈ ఘటనపై బెయిలబుల్ కేసు పెట్టారని గుర్తు చేశారు. దాడి చేసిన వారు గ్రామంలో దర్జాగా తిరుగుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మురాలచింతల ఘటనను బయట పెట్టగానే అవినాష్ రెడ్డికి, వైసీపీ పార్టీకి భయం పట్టుకుందన్నారు. అన్యాయం జరుగుతుందని చెబుతున్నాం కాబట్టే వారు భయపడుతున్నార న్నారు. వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందనే పోరాడుతున్నానని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండ ఉండాలనే ఇలా చేస్తు న్నానన్నారు. ప్రజలను తమ ఓటు న్యాయం కోసం ధర్మం కోసం వేయండని సునీత పిలుపుని చ్చారు.
సీఎం జగన్ పై సునీత కామెంట్స్
0
313
Previous article
Next article
Latest Articles
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
టాలీవుడ్లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...
- Advertisement -
- Advertisement -


