టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్పై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా… చంద్రబాబు కళ్లలో బంగారు భవిష్యత్ చూడడానికే పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చాన్నారు. టీడీపీకి ఇప్పటికి 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని … ఇంకా వెతికే పనిలోనే ఉన్నారని అన్నారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. తమ వల్ల మేలు జరిగితేనే మళ్లీ ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్కు తప్ప ఇంకెవరి కైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ను ఎవరూ పట్టించు కోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా అంతిమంగా విజయం వైసీపీదేనని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్పై వైవీ సుబ్బారెడ్డి స్పందన
0
344
Previous article
Next article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


