తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయకారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్కి అలవాటన్నారు. బీజేపీ ఏ విషయాన్నైనా బహిరంగంగానే చెప్తుందన్నారు. బీఆర్ ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని… తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలని 17 స్థానాలలో నిలబెట్టబోతున్నామని… మోడీ చరిష్మాతో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.