31.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందే.. మద్దతుకై నేడు ఈటల రాక

స్వతంత్ర వెబ్ డెస్క్: మాస్టర్ ప్లాన్(Master Plan) తో నిర్మల్(Nirmal) పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని, బీఆర్ఎస్(BRS) నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకుంటున్నారని బీజేపీ(BJP ) సహా కాంగ్రెస్(Congress) నేతలు విమర్శిస్తున్నారు. గ్రీన్ జోన్(Green Zone) లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్(Industrial Zone) లోకి మార్చి రైతులను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheshwar Reddy) ఆరోపించారు. నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే బిజెపి నాయకులు జాతీయ రహదారి దిగ్భందనానికి పిలుపునిచ్చారు.

శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళుతున్న మహేశ్వర్ రెడ్డిని పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉండడంతో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు అనుమతి లేదని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో బిజెపి నాయకులకు, పోలీసులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు బైఠాయించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు తెలిపెందుకు గురువారం హుజూరాబాద్(Huzurabad) ఎమ్మెల్యే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) రానున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్