స్వతంత్ర, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రధాలను జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శిలకం మధుసూదనరెడ్డి ప్రారంభించారు. అన్నవరం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలో జనసేనని వారాహి యాత్రను నిర్వహిస్తారు. అనంతరం 14వ తేదీన కత్తిపూడిలో జరుగు బహిరంగ సభ జరుగనుంది. ఈ సందర్భంగా యాత్రను విజయవంతం చేయాలని పది ప్రచార రథాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ జనసైనికులు ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 ప్రచార రధాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రథాలు ప్రారంభం
0
498
Previous article
Latest Articles
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -


