స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఆయన సోదరుడు పీరుకట్ల ప్రభాకర్ రవు పసుపు కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇంఛార్జి కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు వారిద్దరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పీరుకట్ల సోదరులతో పాటు వారి అనుచరులు కూడా టీడీపీలో చేరారు. వీరి చేరికతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోనుంది.
తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ
0
321
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


